టాలీవుడ్ క్రేజీ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అతడికి పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ఇక ఈ ‘రౌడీ’ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలా సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్ను పెంచుకుంటున్న విజయ్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పన్నెండు మిలియన్లకు చేరుకున్నది. దీంతో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన దక్షిణాది హీరోగా విజయ్ దేవరకొండ అరుదైన రికార్డును సృష్టించారు. దీంతో ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
మిగతా హీరోలు అల్లు అర్జున్ (11.8), మహేష్ బాబు (6.7), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6)కు కన్నడ స్టార్ హీరోలైన యశ్(5) మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా వీళ్లందరిని వెనక్కి విజయ్ 12 మిలియన్ల ఫాలోవర్స్తో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు. ఇక విజయ్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం లైగర్ విషయానికి వస్తే ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఓ డాన్ పాత్రలో కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా మూవీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.