మాజీ భర్త పీటర్ పాల్ మరణంపై వనితా విజయ్ కుమార్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది..
ప్రముఖ బహుబాషా నటి వనితా విజయ్కుమార్ మూడో భర్త పీటర్ పాల్ గత శనివారం మరణించిన సంగతి తెలిసిందే. పాల్ కొద్దిరోజుల క్రితం గుండెపోటు కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇక, పీటర్ పాల్ మరణంపై ఆయన మాజీ భార్య వనితా విజయ్ స్పందించారు. తాజాగా, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఈ విధంగా ఉంది.
‘‘ ఇతరులకు సహాయం చేసే వారికి దేవుడు కచ్చితంగా సహాయం చేస్తాడని మా అమ్మ నేర్పింది. అది అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం. ఎటూ తోచని స్థితిలో ఉన్నపుడు మనకు మనమై నిర్ణయాలు తీసుకోవాలి. ఆసుపత్రిలో ఉన్నపుడు నువ్వు దెయ్యాలతో పోరాటం చేశావు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీకు ప్రశాంతత లభించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీ మరణంపై నేను ఎంతో బాధపడుతున్నాను. నువ్వు ఓ సరైన ప్రదేశంలోనే ఉంటావని అనుకుంటున్నాను. ఎట్టకేలకు ప్రశాంతతను సాధించావని అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, చిత్ర పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పనిచేసే పీటర్ పాల్కు ఓ సినిమా కథ నరేషన్ సమయంలో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2020 జూన్ 27న వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి వివాహం బంధం మూన్నాళ్ల ముచ్చటే అయింది. నాలుగు నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. పీటర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని వనిత 2020 అక్టోబర్ లో విడాకులు తీసుకుంది. మరి, మాజీ భర్త మరణంపై వనిత ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.