మళ్లీ పెళ్లి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్రలు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ఈ సినిమాలో సౌమ్య సేతుపతి పాత్రలో నటించారు.
ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తల్లో ఒకరైన వనితా విజయ్ కుమార్ అంటే గుర్తు పట్టలేరు కానీ, వివాదాల తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల ఆమె మరోసారి తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది. మళ్లీ పెళ్లి ద్వారా వచ్చిన ఆమె.
మాజీ భర్త పీటర్ పాల్ మరణంపై వనితా విజయ్ కుమార్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది..
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ తారలు.. వారి బంధువులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరవాత మళ్లీ మరో తెలుగు సినిమాలో వనిత నటించలేదు. కానీ, ఆ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె పేరు మారుమోగింది. దీనికి కారణం ఆమె మూడో పెళ్లి. లాక్డౌన్ సమయంలో పీటర్ అనే ఫిలిం మేకర్ను ఆమె మూడో పెళ్లి చేసుకోవడం.. దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం.. పీటర్తో వనితకు […]