సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సింగర్ కీటన్ పియర్స్ హఠాత్తుగా మరణించారు. ఈ విషయాన్ని ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించింది. కీటన్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. ఆ కారణంగా అతను తుదిశ్వాస విడిచినట్లు అతని స్నేహితులు తెలిపారు.
సింగర్ కీటన్ మరణ వార్త వినగానే రాక్ బ్యాండ్ ‘టూ క్లోస్ టు టచ్’ అభిమానులలో విచారం నెలకొంది. కీటన్ మరణ వార్త మమ్మల్ని కలచి వేసిందని.. మాకు బాధలో మాటలు కూడా రావడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
కీటన్ పియర్స్ తో కలిసి.. లీడ్ గిటారిస్ట్ థామస్ కిడ్, రిథమ్ గిటారిస్ట్ మాసన్ మార్బుల్, బాసిస్ట్ ట్రావిస్ మూర్ మరియు డ్రమ్మర్ కెన్నెత్ డౌనీతో కలిసి 2013లో టూ క్లోజ్ టు టచ్ ని ప్రారంభించారు. 2015లో ‘నెర్వ్ ఎండింగ్స్’, 2016లో ‘హావెన్ నాట్ బీన్ మైసెల్ఫ్’, 2014లో ‘టూ క్లోజ్ టు టచ్’ తో చాలా ఆల్బమ్లను రిలీజ్ చేశారు.
2018లో, థామస్, ట్రావిస్ బ్యాండ్ నుండి వెళ్ళిపోగానే.. కీటన్, మాసన్ మరియు కెన్నెత్ ఈ బ్యాండ్ ని కొనసాగించారు. ఆ తర్వాత 2019లో ఐయామ్ హార్డ్ టు లవ్, 2020లో బట్ సో ఆర్ యు ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. ఇక కీటన్ మంచి గేమర్ కూడా.. తన ట్విచ్ ఛానెల్ లో ‘అపెక్స్ లెజెండ్స్,’ ‘రోగ్ కంపెనీ,’ ‘వాలరెంట్’ లాంటి గేమ్స్ ఆడుతూ ఉండేవాడని సమాచారం. మరి స్టార్ సింగర్ కీటన్ మృతిపట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I’m absolutely heartbroken. I love you, @KeatonPierce. I’m going to miss you so much 💔 pic.twitter.com/sVtLKFqYxf
— Alyson Coletta (@alysoncoletta) March 26, 2022