ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని పేరు తెలియని వారుండరు. తన అందం, నటన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించిన ఒకప్పటి హీరోయిన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన అనుభూతుల్ని పంచుకున్నారు.
హేమమాలిని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్. ఆమె దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చాలా సినిమాలు సక్సెస్ను సాధించాయి. హేమమాలినిని అభిమానులు అందరు ‘డ్రీం గర్ల్’ అని పిలిచేవారు. సినిమాలకు దూరమైన తర్వాత రాజకీయంగా రంగ ప్రవేశం చేశారు. లోక్సభ సభ్యురాలిగా పదవిని చేపట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితంలోని అనుభవాల్ని పంచుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ దర్శకుడు తన చీరకున్న పైట పిన్నును తీసేయమన్నాడు. అప్పుడు చాలా షాకయ్యానని హేమ తెలిపారు. పిన్ను తీసేస్తే చీర జారిపోతుంది కదా అంటే తనకు కావాల్సింది అదే అన్నాడు. ఆ మాటలకు చాలా కంగారు పడ్డానని ఆమె తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హేమమాలిని తన జీవితంలో సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. షోలే, సీత ఔర్ గీత లాంటి సినిమాల్లో ధర్మేంద్రతో కలిసి నటించారు. ఆ సమయంలో వారిద్దరు ప్రేమించుకున్నారు. అయితే అప్పటికే పెళ్లైపోయిన ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. తన భర్త కూతుళ్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడని, ముఖ్యంగా వారి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని తెలిపారు.
‘సత్యం, శివం, సుందరం’ సినిమా మొదట తనకు ఆఫర్ వచ్చిందని చెప్పింది. అప్పటి పరిస్థితుల ప్రభావంతో ఆ ఆఫర్ వదులుకున్నానని తెలిపారు. హేమమాలిని ఇప్పటికీ చాలా హుషారుగా ఉంటూ ముంబై వీధుల్లో కనిపిస్తుంటారు. తన అభిమానులను సరదాగా పలకరిస్తారు. మెట్రో ప్రయాణంలో కూడ తను ప్రయాణించేటప్పుడు సాధారణ వ్యక్తులతో కూడా చాలా సింపుల్ గా కలిసిపోతారు. రాజకీయాల్లో కూడా సేవలందించి అందరి మన్ననలు పొందుతున్నారు మన డ్రీమ్ గర్ల్.