తమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఈమధ్య కాలంలో ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. అయితే తమన్ మ్యూజిక్ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో.. ఇక విమర్శలు కూడా అదే రేంజ్లో వస్తాయి. మరీ ముఖ్యంగా తమన్ మ్యూజిక్ అందించిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాటని కాపీ కొడతారనే విమర్శలు వస్తాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ‘‘మ మ మహేషా’’ పాట మీద మాత్రం విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ అనే పాట నుంచి ట్యూన్ కాపీ కొట్టాడని తమన్ను ఏకిపారేశారు. అయితే తనకు గానీ, తన టీంలోని సభ్యులెవ్వరికీ గానీ అలా అనిపించలేదని, ఏదో ఫ్లోలో చేసుకుంటూ పోయామని తమన్ కవర్ చేసేశాడు. అయితే తాజాగా జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ సెలెబ్రేషన్స్లో తమన్ ఈ కాపీ ట్యూన్ మీద పరోక్షంగా స్పందించాడు. ప్రస్తుతం తమన్ వ్యాఖ్యలు వైరలవతున్నాయి.
సక్సెస్ మీట్లో తమన్ మాట్లాడుతూ..‘‘మహేష్ బాబు గారు ఇలా స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ వేయడం ఇదే మొదటి సారి. ఆయన క్లాస్.. ఆయనకు వచ్చే కలెక్షన్ల ఫిగర్లు మాస్. అనంత్ శ్రీరామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. చిత్రగుప్తుడు అనే ట్యాగ్ కూడా సంపాదించుకున్నాడు. కరోనా కంటే ముందే ఈ పాటలన్నీ రికార్డ్ చేశాం. పరుశురామ్కే ఈ ఆల్బమ్ క్రెడిట్ అంతా ఇస్తాను. మహేష్ బాబు మీదున్న అభిమానంతోనే ఆయన ఇలా చేయగలిగాడు. తొమ్మిదో తారీఖు వరకు పని చేస్తూనే ఉన్నాం. రెండు మూడు కీబోర్డులు విరిగిపోయాయి. రికార్డింగ్ థియేటర్లో మేం అంతా కూడా ఫ్యాన్స్లా గంతులు వేశాం. ఆయనతో పని చేయడం నాకు బాధ్యతలా అనిపిస్తుంది’’ అన్నాడు.
ఇది కూడా చదవండి: వీడియో వైరల్: కళావతి పాటకు డాన్స్ ఇరగదీసిన తమన్!
అంతేకాక ‘‘బ్లాక్ బస్టర్ అనే పదం ఆయనకు సింక్ అవ్వాలి.. సర్కారు వారి పాట అనే ర్యాప్ ఈ సక్సెస్కు సెట్ అయింది. ట్విట్టర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. నేను అందరి మెసెజ్లు చూస్తున్నాను. నేను ఇంకా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను’’ అని తన కాపీ ట్యూన్ మీద ఇలా స్పందించాడు. మరి తమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.