ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు వివాహం చేసుకున్న సంఘటనలు ఇప్పటికి అనేకం జరిగాయి. కానీ వీరిలో కొద్ది మంద మాత్రమే.. రీల్ మీద మాత్రమే కాక రియల్గా కూడా బెస్ట కపుల్గా నిలిచి.. పది మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు.. నటుడు సూర్య, ఆయన భార్య, నటి జ్యోతిక. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్, బెస్ట్ కపుల్ జాబితాలో వీరద్దరూ ముందు వరుసలో ఉంటారు. ఇక సౌత్లో సూర్య ఫాలోయింగ్ గురించి.. ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమర్షియల్, కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్లో ముందుకు సాగుతున్నాడు సూర్య. జై భీమ్, ఆకాశమే నీ హద్దు సినిమాలతో తనలోని నటుడిని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడమే కాక.. భారీ విజయాన్ని కూడా అందుకున్నాడు సూర్య. సినిమాల సంగతి పక్కకు పెడితే.. సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో సూర్య ముందుంటాడు. విపత్తుల సమయంలో వెంటనే స్పందిస్తూ.. తనకు చేతనైన సాయం చేస్తుంటాడు. అలానే ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నాడు సూర్య.
తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సూర్య-జ్యోతిక దంపతులు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా.. పేద పిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేస్తున్నారు వీరు. అలానే సూర్య నటించిన జై భీమ్ చిత్రం విడుదల తర్వాత.. గిరిజన పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు ఈ దంపతులు. తాజాగా మరోసారి కోటి రూపాయల సాయం చేసి.. మంచి మనసు చాటుకున్నారు సూర్య-జ్యోతిక దంపతులు.
పళన్ కుడి ఇరులర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు కోటి రూపాయలు సాయం చేశారు సూర్య-జ్యోతిక దంపతులు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కుని సూర్య జ్యోతిక విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో మరోసారి ఈ దంపతులపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతోమందికి మీరు ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సూర్య-జ్యోతిక చేసిన మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@Suriya_offl and #Jyothika met Tamil Nadu CM #Stalin and donated Rs 1 CR from the success of the film #JaiBheem, which they produced, to the educational development of tribal children.👏👏 #Suriya #TamilNadu pic.twitter.com/3oRACcaH1T
— Suresh Kondi (@SureshKondi_) December 11, 2022