ప్రముఖ సీనియర్ కోలీవుడ్ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాజేందర్ తనయుడు, స్టార్ హీరో శింబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
‘మా నాన్న(రాజేందర్)కు ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో చేర్పించాం. ఆయన కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. అందువల్ల మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్ళనున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని శింబు తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఆయనను ఓ ప్రైవేట్ జెట్ లో అమెరికాకు తరలించనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన ఆరోగ్యం గురించి భార్య ఉష మాట్లాడుతూ.. ‘అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారు. ఆహారం తీసుకుంటున్నారు. ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుతున్నారు. మెరుగైన వైద్యం అందించాలని శింబు చెప్పడంతో ఆయనను విదేశాలకు తీసుకెళ్తున్నాం. వీసా కూడా వచ్చింది. రెండు రోజుల్లో బయలుదేరతాము. విదేశాల్లో అయితేనే ఆయనకు ప్రైవసీ కూడా దొరుకుతుంది. చెన్నైలో అయితే ఆయన చుట్టూ ఎప్పుడూ 15 మందికి పైగా ఉంటారు. అమెరికాలో అయితే ప్రైవసీ ఉంటుంది’ అని ఆమె చెప్పారు.
— Silambarasan TR (@SilambarasanTR_) May 24, 2022
ఇదిలా ఉండగా.. తమిళ ఇండస్ట్రీలో టి. రాజేందర్.. ఓ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, సింగర్ గా తనదైన మార్క్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 1980ల టైంలో రాజేందర్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. ఇక ఆయనకు రాజేందర్ కు భార్య ఉష, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో శింబు స్టార్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టి. రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.