Manasa Charan: తెలుగు బుల్లితెర నటీనటులు ప్రియతమ్ చరణ్, మానస భార్యాభర్తలు అనే విషయం సీరియల్ లవర్స్ అందరికీ తెలిసిందే. సీరియల్ నటులైన వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియతమ్, మానస దంపతుల ఇంట్లో రెండోసారి పండంటి మగబిడ్డ అడుగు పెట్టాడు. మొన్నటివరకూ నిండు గర్భిణిగా ఫ్యాన్స్ ని పలకరించిన మానస.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక హాస్పిటల్ లో బిడ్డను పట్టుకొని ఉన్న మానసతో భర్త, నటుడు ప్రియతమ్ సెల్ఫీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దంపతులకు రెండేళ్ల కొడుకు ప్రేమ్ హరివంశ్ ఉన్నాడు. ఇప్పుడు మరో బాబు రాకతో ఈ సీరియల్ స్టార్స్ ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుండటం మనం గమనించవచ్చు.
ఇదిలా ఉండగా.. సీరియల్ నటుడు ప్రియతమ్ చరణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మనసు మమత, అడగక ఇచ్చిన మనసు. లక్ష్మీ కళ్యాణం లాంటి సీరియల్స్ లో హీరోగా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు ప్రియతమ్. ఇక మానస విషయానికి వస్తే.. మొదట ఓంకార్ నిర్వహించిన ఛాలెంజ్ 3 రియాలిటీ షోలో విజేతగా నిలిచి.. సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ.. మాటే మంత్రము, గిరిజా కళ్యాణం సీరియల్స్ తో గుర్తింపు పొందింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. మరి ఈ సీరియల్ జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.