దేశంలో కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి రోజురోజుకి భారీ సంఖ్యలో విజృభిస్తోంది. కరోనాతో పాటు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఎందరో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. డిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, నితిన్ వైఫ్ షాలినీ, థమన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఇటీవల కరోనా బారినపడ్డారు.
తాజాగా ‘బాహుబలి’ సినిమాలో కట్టప్పగా మనందరినీ మెప్పించిన సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు. తమిళ సీనియర్ నటుడు, బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు సత్యరాజ్. కరోనా సోకి పరిస్థితి సీరీయస్ గా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం చెన్నై(అమింతకరై)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మరి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.