ఇప్పుడంటే వాళ్లు స్టార్ హీరో లేదా హీరోయిన్ అయ్యుండొచ్చు. కానీ ఒకప్పుడు వాళ్లు కూడా యాక్టింగ్ విషయంలో కష్టపడే ఉంటారు. ఎప్పుడో గానీ వాటిని బయటపెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అలా ఇంట్రెస్టింగ్ ఫొటోలతో పాటు వాటి వెనకున్న స్టోరీ కూడా చెబుతూ ఉంటారు. హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా? తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమెనే, తను హీరోయిన్ కాకముందు ఫేస్ చేసిన పరిస్థితి గురించి రివీల్ చేసింది. చాలా ఏళ్ల క్రితం తన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సమీరారెడ్డి అనగానే ఇప్పటి జనరేషన్ కు అసలు తెలియకపోవచ్చు. 2005లో ఎన్టీఆర్ ‘నరసింహుడు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. జై చిరంజీవ, అశోక్ సినిమాలు చేసింది. 2012లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించి సందడి చేసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 2014లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకున్న ఈమెకు కొడుకు హన్స్, కూతురు నైరా ఉన్నారు. ఇక సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమీరారెడ్డి ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే తన తొలిసారి ఆడిషన్ కు వెళ్లినప్పటి పిక్స్ పోస్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.
‘అది 1998. నేను మహేష్ బాబు సినిమా ఆడిషన్ కు వెళ్లాను. ఆ రోజు చాలా భయమేసింది. దాంతో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఇంటికి తిరిగి వెళ్తూ చాలాసేపు ఏడ్చేశాను. ఆ తర్వాత ఓ డెసిషన్ తీసుకున్నాను. రెండేళ్లపాటు పనిచేసిన వాచ్ కంపెనీలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. నా ముఖానికి డెస్క్ జాబే సరైనదని అనుకున్నా. కానీ ఆ తర్వాత మళ్లీ ధైర్యం తెచ్చుకుని హిందీలో అహిస్తా కీజియో బాటియన్ మ్యూజిక్ వీడియో చేశాను.’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చింది. ఇక ఈమె అప్పటి విషయాలు చెప్పడం మాటేమోకానీ ఆమె గ్లామర్ చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తెగ పొగిడేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. సమీరారెడ్డి ఫొటోస్ మీకెలా అనిపించాయి. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.