బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ ఓ వీడియో గేమ్పై కోర్టుకెక్కాడు. ‘సెల్మోన్ భోయ్’ అనే వీడియో గేమ్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ముంబయిలోని సివిల్ కోర్టులో ఆగస్టులో సల్మాన్ ఖాన్ దావా వేశాడు. ఆ దావాపై విచారించిన సివిల్ కోర్టు వీడియో గేమ్ను తాక్తాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విషయం ఏంటంటే ఫుట్పాత్పై పడుకున్న కొందరిపైకి 2002లో సల్మాన్ ఖాన్ కారు ఎక్కించాడని కేసు నమోదైంది. అది కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు కృష్ణజింకల కేసులో సల్మాన్ ఖాన్ కొన్నిరోజులు జైలు జీవితం గడిపాడు. వీటిని ఆధారంగా చేసుకుని పేరడీ స్టూడియో వారు ఓ వీడియో గేమ్ను రూపొందించారు. ఆ వీడియో గేమ్కు బయట మంచి ఆదరణే లభించింది. దాంతో ఆ గేమ్ వల్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయంటూ సల్మాన్ ఖాన్ కోర్టుకెక్కారు. కోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. సల్లూభాయ్ ‘టైగర్ 3’ షూట్తో బాగా బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా సల్మాన్ ఓ క్రేజీ ప్రాజెక్టు చెస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.