ఇండస్ట్రీలో దర్శకులు చిన్న హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ హీరోతో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ డైరెక్టర్ ఒక్కసారిగా టాప్ లిస్టులోకి చేరిపోతారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు రుజువు చేశారు. ఈ లిస్టులో తాజాగా మరొక డైరెక్టర్ కూడా చేరిపోయాడని తెలుస్తోంది.
కొత్త దర్శకులు చిన్న హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ హీరోతో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ డైరెక్టర్ ఒక్కసారిగా టాప్ లిస్టులోకి చేరిపోతారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు రుజువు చేశారు. అందుకే డైరెక్టర్లు కొంచెం లేట్ అయినా సరే.. టాప్ హీరోలకోసం పడిగాపులు కాస్తారు. వంశీపైడిపల్లి, కొరటాల శివ, అట్లీ, లోకేష్ కనగరాజ్, బాబీ అందరూ కూడా స్టార్ హీరోతో హిట్టు కొట్టి చాలా తక్కువ టైంలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ లిస్టులో తాజాగా మరొక డైరెక్టర్ కూడా చేరిపోయాడనే చెప్పాలి. అతనెవరో కాదు రీసెంట్ గా “వీర సింహారెడ్డి ” సినిమాతో బంపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరో స్వయంగా గోపీచంద్ మలినేని మీద కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలైనా.. సరైన గుర్తింపు దక్కింది మాత్రం క్రాక్ సినిమాతోనే. పక్కామాస్ సినిమాగా వచ్చి భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ సినిమా. ఆ తర్వాత బాలకృష్ణ లాంటి బడా హీరోతో సాలిడ్ హిట్ కొట్టి తాను కూడా టాప్ డైరెక్టర్ ల లిస్టులో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. అందుకే ఇప్పుడు ఈ డైరెక్టర్ కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. గోపీచంద్ మలినేని టేకింగ్ కి మెగా స్టార్ సైతం ఫిదా అయ్యాడని..అందుకే ఇప్పుడు ఈ దర్శకునికి మెగాస్టార్ నుండి పిలుపు వచ్చిందని సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అంతేకాదు.. గోపిచంద్ తన సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, మాస్ స్టెప్పులు ఉండేలా చూసుకుంటాడు. దీనితో చిరంజీవికి కూడా ఎప్పటినుండో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలి అనుకుంటున్నాడట.
ఈ క్రమంలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు కథలు చెప్పినప్పటికీ.. మెగాస్టార్ తర్వాతి సినిమా మాత్రం ఈ దర్శకుడితోనే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. తమిళ్ సినిమా వేదాళం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడని కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే జరిగితే గోపిచంద్ మలినేని.. బాస్ ని తెరపై ఎలా చూపిస్తాడనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.