సినీ ప్రపంచంలో రారాజు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకం సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖలు తమ సంతాపం తెలిపారు. ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళర్పించారు. మహేష్ బాబును ఓదార్చి..ధైర్యం చెప్పారు. పద్మాలయ స్టూడియో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన తరువాత మహా ప్రస్థానంలోని అత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రపంచంలోని ఓ ధృవతార తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
సినీ ఇండస్ట్రీలో కృష్ణ మంచితనానికి మారు పేరు. ఆయన ఎంతో మందికి సాయపడ్డారు. సహాయం కోసం తన ఇంటి గడప తొక్కిన వారిని ఆదుకుంటారు. డబ్బుల కంటే మనుషులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే కృష్ణ.. వేల కోట్ల ఆస్తి కూడబెట్టకపోయినా..లక్షలాది మంది మనుష్లులో చోటు సంపాందించారు. ఆయన నిర్మాత గురించే ఆలోచించే హీరో. వారి బాగుంటే అందరు బాగుంటారు అనే మాటను బలంగా నమ్మిన వ్యక్తి కృష్ణగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అని రికార్డులను ఆయన సృష్టించారు. అప్పట్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు. అయితే అంతాల డబ్బును సంపాందించిన కృష్ణ గారు ఆదా చేసుకోలేదు. స్నేహితులకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. అడిగిన వాళ్లకు లేదనకుండా డబ్బులు ఇచ్చేవాళ్లంట.
కృష్ణ నుంచి డబ్బులు తీసుకున్నవాళ్లు తిరిగి ఆయనకు ఇచ్చేవారు కాదట. ఈ విషయంలో మహేష్ బాబు కూడా తన తండ్రి అంత మంచితనంగా మాత్రం ఉండకూడదని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. ఎన్ని సార్లు మోసం పోయిన కూడా పదే పదే నమ్మి డబ్బులు ఇస్తుంటారంట. ప్రస్తుతం కృష్ణ పేరున రూ.400 కోట్ల ఆస్తి ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది అనేది అందరిలో ఉన్న సందేహం. అయితే కృష్ణ గారు తన ఆస్తికి సంబంధించి ఓ వీలునామా రాశారంట. ఈ 400 కోట్ల ఆస్తిని తన మనవళ్లు, మనవరాలుకు సమానంగా పంచాలని కోరినట్లు టాలీవుడ్ వర్గాలో వార్తలు వినిపిస్తోన్నాయి.