తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యన్టీఆర్, నాని ఇలా చాలా మంది హీరోలు పలు రియాల్టీ షోల్లో హూస్ట్ లుగా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ సైతం బుల్లితెరపై అడుగు పెట్టారు. ఆయన కెరీర్ లో మొదటిసారిగా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే సెలబ్రెటీ టాక్ షోకి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ సక్సెస్ చేశారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 నడుస్తుంది.
ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ లతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న రెండు ఎపిసోడ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి ఎపిసోడ్ లో జోష్ తో ఉండాలన్న ఉద్దేశంతో బాలయ్య బంధువులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్పెషల్ గెస్టులుగా విచ్చేశారు. ఈ షోలో రాజకీయాలు, వ్యక్తగత జీవితాల గురించి ముచ్చటించారు. ఇక రెండవ ఎపిసోడ్ లో సిద్దు జోన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ఎమోషనల్, ఫన్నీగా నడిచింది. ఇక మూడో ఎపిసోడ్ వచ్చే గెస్ట్ గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి.
అన్ స్టాపబుల్ సీజన్ 2 మూడో ఎపిసోడ్ లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాలు గెస్టులుగా రాబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరో ఎపిసోడ్ కి మంత్రి రోజా గెస్ట్ గా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఫిలిమ్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. ఒకవేళ ఈ షోకి మంత్రి రోజా వస్తే.. ప్రస్తుతం రాజకీయా గురించి ప్రస్తావించే అవకాశం ఖచ్చితంగా ఉండవొచ్చని భావిస్తున్నారు. కానీ.. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఈ షోకి మంత్రి రోజా వచ్చే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే వీరిద్దరి కాంబోలో షో వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సామాన్య ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ క్రేజీ గాసిప్ నిజమా? కాదా అన్న విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!