తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ కామెడీ షోకు ఇంతకాలం జడ్జిగా వ్యవహరించిన నటి రోజా వీడ్కోలు పలికారు. జబర్దస్త్ షోకు సంబంధించిన అందరు కమెడియన్స్, యాంకర్స్, టెక్నికల్ టీమ్ అంతా కలిసి.. ఇటీవల రోజా గారు ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో స్టేజిపైకి వచ్చిన రోజా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు.
మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ లో మొదటిసారి జబర్దస్త్ సెట్ లో అడుగుపెట్టిన రోజా స్టేజిపై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. రోజాతో పాటు జబర్దస్త్ టీమ్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఆమె మాట్లాడుతూ.. “నేను రెండుసార్లు ఎమ్మెల్యే ఇక్కడే అయ్యాను. మినిస్టర్ కూడా ఇక్కడే అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్మాను.. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇకపై చేయడం కష్టమే.. కానీ మీ అందరినీ మిస్ అవుతాను. ఆ బాధ ఉంది. సర్వీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ అవకాశం వచినప్పుడు ఇలాంటి ఇష్టాలను కూడా వదులుకోవాలి” అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మంత్రి రోజాగారి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.