సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ మూవీకి దర్శకురాలు. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా ఎక్స్ పీరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ రీతువర్మ.
లక్ష్మీ సౌజన్య గారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు భూమి. ఫీమేల్ లీడ్ కి ఛాలెంజింగ్ రోల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి. సినిమా చూశాక భూమి క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. టీజర్ , ట్రైలర్ చూసి ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. పెళ్లి చూపులు సినిమాలో కూడా నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ.., భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది.
ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. సినిమాల విషయంలో ఆయన చాలా డెడికేటెడ్ గా ఉంటాడు. షూట్ ఉన్నప్పుడు టైం కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాడు. వర్కౌట్స్ చేసి ఎప్పుడూ ఫిట్ గా ఉంటాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ కి పెయిర్ సెట్ అవ్వాలి. అప్పుడే సినిమా ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో …మా పెయిర్ వర్కౌట్ అయింది కాబట్టి రిలీజ్ కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టేనని హీరోయిన్ రీతు వర్మ తన నమ్మకాన్ని వ్యక్తం చేయడం విశేషం. మరి.. ‘వరుడు కావలెను‘ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.