ప్రాజెక్ట్ కే నటీనటుల రెమ్యూనరేషన్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా..
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-గ్లోబల్ స్టార్ దీపికా పదుకునే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. వైజయంతి మూవీస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. దాదాపు 500 కోట్లకుపైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథకు తగ్గట్టుగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలు కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.
ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దుతున్నారట దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక, ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన పోస్టరో..టీజరో వదులుతూ సినిమా మీద హైప్ను పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించేందుకు గాను ప్రభాస్ దగ్గరినుంచి కీలక పాత్రధారుల వరకు పెద్ద మొత్తం తీసుకున్నారంట. కేవలం నటీనటుల రెమ్యూనరేషన్ కోసం మాత్రమే 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్ ప్రకారం.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం 150 కోట్ల రూపాయలు తీసుకున్నారంట. దీపికా పదుకునే 10 కోట్ల రూపాయలు తీసుకున్నారట. లోకనాయకుడు కమల్ హాసన్ తన పాత్ర కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఇక, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 15 కోట్ల రూపాయలు.. హీరోయిన్ దిశా పఠానీ 5 కోట్ల రూపాయలు తీసుకున్నారట. మరి, సోషల్ మీడియాలో వైరలవుతున్న ‘ప్రాజెక్ట్-కే’ నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.