పాన్ ఇండియా స్టార్ రష్మికా మందన్న తన కెరీర్లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘యానిమల్’ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్ను పూర్తి చేశారామె. కాగా, రష్మికను ఆమె మేనేజర్ ఆర్థికంగా మోసం చేశాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మికా మందన్న తన కెరీర్లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస చిత్రాలు చేస్తూ ఆమె దూకుడు పెంచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ కావడంతో బాలీవుడ్పై ఆమె ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటించారు. వీటిల్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి యాక్ట్ చేసిన ‘మిషన్ మజ్ను’ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కెరీర్తో ఖాళీ లేకుండా బిజీబిజీగా గడుపుతున్న రష్మికను ఆమె మేనేజర్ ఆర్థికంగా మోసం చేశాడని వార్తలు వచ్చాయి. రష్మికకు తెలియకుండా సుమారు రూ.80 లక్షలు కాజేసినట్లు బాలీవుడ్ మీడియాలో ఇటీవల న్యూస్ వచ్చింది. మోసం గురించి తెలియగానే రష్మిక అతడ్ని విధుల నుంచి తొలగించారని కథనాలు వచ్చాయి.
కెరీర్ మొదలైనప్పటి నుంచి తన దగ్గరే మేనేజర్గా పని చేస్తున్న వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడటంతో రష్మిక బాధపడ్డారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. మేనేజర్ మోసంపై ఎట్టకేలకు రష్మిక స్పందించారు. మేనేజర్తో తనకు కలహాలు తలెత్తాయంటూ వచ్చిన రూమర్స్కు ఆమె చెక్ పెట్టారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారామె. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని.. అయితే కెరీర్లో ఎవరికి వారు ఎదగాలని నిర్ణయించుకున్నామని రష్మిక స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తాము ప్రొఫెషనల్స్ అని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా సరే, పనికి కట్టుబడి ఉంటామని రష్మిక పేర్కొన్నారు. మేనేజర్ మోసం అంశంపై అధికారిక ప్రకటనలో ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు రష్మిక. ఆయన్ను ఎందుకు తొలగిస్తున్నారో క్లారిటీ ఇవ్వకుండా.. జస్ట్ విడిపోతున్నామని తెలిపారు. దీంతో ఎలాంటి ఘటనా చోటుచేసుకోకుండా మేనేజర్ను తొలగించడంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Actress #RashmikaMandanna & her Manager releases an official statement about ongoing rumours.They parted ways on a peaceful note. pic.twitter.com/6oRfwk2N43
— GSK Media (@GskMedia_PR) June 22, 2023