Ramya Raghupathi: నటుడు నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, కన్నడ మీడియా ముందుకు వచ్చిన రమ్య.. నరేష్, పవిత్రాలోకేష్ల పెళ్లిపై సంచల వ్యాఖ్యలు చేశారు. పవిత్రా లోకేష్, నరేష్లకు పెళ్లయిందని ఆరోపించారు. తాను నరేష్నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. రమ్య మాట్లాడుతూ.. ‘‘ నిన్న ప్రెస్ మీట్లో పవిత్ర నా భార్య అని నరేష్ అన్నారు. ఇద్దరికీ పెళ్లయింది కాబట్టే నరేష్ అలా అన్నారు. నరేష్నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చట్టప్రకారం నేను ముందుకు వెళతాను’’ అని అన్నారు.
నిన్న రమ్య గురించి నరేష్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఇప్పటి వరకు 100కుపైగా మహిళలతో పనిచేశా. ఎక్కడన్నా చూసుకో.. గూగుల్లో కూడా తీసుకో.. నేను చీట్ చేశానని, వేధించానని ఎక్కడన్నా ఉందా. మ్యారేజ్ గురించి రావచ్చు. నా మ్యారేజీ ఫేయిల్. వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లను నేను ఆపలేదు. ఎందుకంటే.. నేను రాజకీయాల్లో ఉన్నాను. సేవారంగంలో ఉన్నాను. వాళ్ల స్వలాభం కోసంవాళ్లు వెళ్లిపోయారు. రమ్య రఘుపతి నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఓ పెద్ద ఫ్యామిలీని స్మాష్ చేసింది. క్రిష్ణ గారు, పెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది.
నేను తట్టుకోలేక.. క్రిష్ణగారు చెబితే 10 లక్షల రూపాయలు ఇచ్చాను. అయినప్పటికి ఆమె ఇంకా నన్ను వదిలిపెట్టడం లేదు. రమ్య.. ఫ్యామిలీ ఫంక్షన్లలో నువ్వెక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు. అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు. పవిత్రా లోకేష్ నా లైఫ్లోకి వచ్చి 4 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ, నేను నీతో 8 ఏళ్ల క్రితంనుంచే దూరంగా ఉంటున్నాను’’ అని అన్నారు. మరి, పవిత్రా లోకేష్, నరేష్లకు పెళ్లయిందని అంటున్న నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Naresh: 4 ఏళ్ళ క్రితమే పవిత్రా లోకేష్ నా జీవితంలోకి వచ్చింది: నరేశ్