నరేష్-పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా, సహజీవనం లాంటివి కాదు ఏకంగా ఓ రియల్ ఇన్సిడెంట్ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?
టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే చాలా జోడీలను చూశారు. కానీ వాళ్లలో నరేష్-పవిత్రా లోకేష్ క్రేజ్ మాత్రం వేరే లెవల్. రీసెంట్ గానే ‘మళ్లీ పెళ్లి’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. రిలీజ్ కి ముందు కాదు లేదు అని అన్నారు కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇది వీళ్ల బయోపిక్ అని తేలిపోయింది. ఈ సినిమా ఓ మాదిరిగా ఆకట్టుకుంది. కానీ జనాల్ని అయితే థియేటర్లలోకి తీసుకురాలేకపోయింది. దీంతో అందరూ ఈ మూవీ గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరో ఆసక్తికర పని చేసి వీళ్లిద్దరూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నరేష్ టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నాడు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడు, హీరోగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె ఇవ్వట్లేదు. మరోవైపు నరేష్, పవిత్రాతో గత కొన్నాళ్ల నుంచి కలిసి ఉంటున్నాడు. దీంతో వీరి రిలేషన్ పై రూమర్స్ తెగ వచ్చాయి. అందుకు తగ్గట్లే ‘మళ్లీ పెళ్లి’ చేసి ఇండస్ట్రీ మొత్తం తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇప్పుడు మరో పనిచేసి చర్చనీయాంశమయ్యారు.
దక్షిణాది భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్రా లోకేష్ స్వతహాగా కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఆమె తన మాతృభాష కన్నడలో పీహెచ్డీ చేయాలని అనుకున్నారు. అందుకోసం పరీక్షలు రాయడానికి తాజాగా బళ్లారి వెళ్లారు. ఆమెతోపాటు నరేష్ కూడా అక్కడికి వెళ్లి, పరీక్ష పూర్తయ్యేంతవరకు వెయిట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవడం నరేష్-పవిత్రాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మాట్లాడుకుంటున్నారు. మరి పవిత్రా లోకేష్ తో పరీక్షలు దగ్గరుండి మరీ నరేష్ రాయించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.