సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్లు జంటగా నటించిన మళ్లీ పెళ్లి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలలో సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే..
తెలుగు ఇండస్ట్రీలో వివాదాల జంట నరేష్-పవిత్రా లోకేష్లు నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నరేష్-పవిత్రల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులను మెప్పించి మళ్లీ పెళ్లి మంచి వసూళ్లను రాబట్టింది. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించి కొన్ని రోజుల ముందే అప్డేట్ వచ్చింది. శుక్రవారం నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఆహాలలో విడుదలకు సిద్ధమైంది.
అయితే, మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్పై నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీ రిలీజ్ను అడ్డుకునేందుకు ఆమె ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో ఓ కేసు వేశారు. ఈ సినిమాలోని పాత్రలకు తమ జీవితాలకు దగ్గరి పోలికలు ఉన్నాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సినిమాలోని సౌమ్య సేతుపతి పాత్ర తనను కించపరిచేలా ఉందని అన్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్ను ఆపేయాలని కోరారు. అనంతరం రమ్య కోర్టునుంచి అమెజాన్ ప్రైమ్, ఆహాలకు లీగల్ నోటీసులు పంపిందట.
మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ను ఆపేయాలని కోరారట. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ విషయంలో వెనకడుగువేసింది. శుక్రవారం ప్రారంభం కావాల్సిన స్ట్రీమింగ్ను ఆపేసింది. అయితే, ఆహా మాత్రం స్ట్రీమింగ్ను కొనసాగిస్తోంది. మళ్లీ పెళ్లి సినిమా ప్రస్తుతం ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని బోల్డ్గా చిత్రీకరించారు. నరేష్-పవిత్ర-రమ్యల జీవితాల్లో జరిగిన వ్యక్తిగత సన్నివేశాలను కూడా యథావిథిగా చిత్రీకరించారు. మరి, రమ్య దెబ్బకు అమెజాన్ ప్రైమ్ మళ్లీ పెళ్లి స్ట్రీమింగ్ను ఆపేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.