ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే.. ఆ క్రెడిట్ కేవలం రాంగోపాల్ వర్మకే దక్కుతుంది. సినిమా వార్తలకంటే కూడా కాంట్రవర్సీ వార్తలలోనే నిలుస్తుంటారు వర్మ. అయితే.. ఈ మధ్యకాలంలో వర్మపై చీటింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్ని కేసులు మీదపడినా వర్మ దేనికి భయపడడు. అవసరమైతే తనపై మరింత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేస్తుంటారు.
రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ఆయన ప్రతి విషయంలో స్పందిస్తూ తన అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు. అది ఏ విషయమైనా సినిమాలు, పాలిటిక్స్, డిబేట్స్ ఇలా ఏదైనా వర్మ తన మార్క్ ట్వీట్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా వర్మ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. అదికూడా తన లాయర్ ని తీసుకొని వెళ్తున్నా అనేసరికి.. ఆ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇంతకీ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి లాయర్ తో కలిసి ఎందుకు వెళ్ళారు? ఎవరిపై ఫిర్యాదు చేయబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడట. ఓ సినిమా విషయంలో నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలపై వర్మ ఫిర్యాదు చేశారట. ‘మా ఇష్టం’ సినిమా లెటర్ హెడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన కారణంగా నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ విషయమై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.