మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇటీవల ఎన్డిటీవీ నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా 2022’ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సంతోషించారు. కాగా.. తాజాగా మెగా ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ ని ట్రూ లెజెండ్ అనడానికి ఇదే కారణం ఉందంటూ.. ఓ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డిటీవీ అవార్డుల వేడుకలో రామ్ చరణ్.. దివంగత కల్నల్ సంతోష్ బాబు పిల్లలతో సెల్ఫీ దిగి ట్రూ జెంటిల్ మెన్ అని చాటుకున్నాడు. ఇప్పుడీ వీడియో ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు రామ్ చరణ్ నిదర్శనమని చెబుతున్నారు ఫ్యాన్స్.
ఇక 2020 గాల్వాన్ ఘటనలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో జరిగిన పోరాటంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయన పిల్లలని ఎంతో ప్రియంగా రామ్ చరణ్ దగ్గరికి తీసుకొని సెల్ఫీ దిగటం ఇప్పుడు అందరినీ ఆనందపరుస్తోంది. ఇక ఇదే వేడుకలో రామ్ చరణ్.. సింగర్ నేహా కక్కర్ ని కలవడం, సోనూసూద్ ని హగ్ చేసుకోవడం కూడా హైలెట్ గా మారింది. అంతేగాక అవార్డు తీసుకున్నాక స్టేజ్ పై చరణ్ ఎమోషనల్ స్పీచ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పిల్లలతో చరణ్ సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చరణ్ ని ట్రూ లెజెండ్, జెంటిల్ మెన్.. మంచి మనసున్న మనిషి అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉండగా.. కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. మరోవైపు శంకర్ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఉప్పెన సినిమాతో డెబ్యూ చేసిన బుచ్చిబాబు.. సెకండ్ మూవీనే రామ్ చరణ్ తో ఓకే చేసుకోవడం విశేషం. కాగా.. ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ అంతా శంకర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి.. త్వరలో ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో!