కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ఈ సినిమాకి ‘పెద్దన్న’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ‘అన్నా చెల్లెళ్ల’ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. ఈ మూవీలో రజినీ సరసన నయనతార నటిస్తుంది. మరో కీలక పాత్రల్లో మీనా, ఖుష్బు నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు హీరోయిన్స్ అయిన కీర్తి సురేశ్, మీనా, కుష్బూ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న సందర్భంగా తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. “ఆహా కల్యాణం .. ఆనంద నాదస్వరం .. మోత మోగుతోందే, పందిళ్ల బంధుజనం .. ఊరంతా కోలాహలం .. ఊయలూగుతోందే” అంటూ కీర్తి సురేశ్ తో పసాటు రజనీ కాంత్, ఖుష్బూ, మీనా తదితరులపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు.
తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, మరో నిర్మాత దిల్రాజు, నారాయణ్దాస్ నారంగ్తో కలిసి రిలీజ్ చేస్తున్నారు. డి.సురేష్బాబు మాట్లాడుతూ ‘‘తమిళంలో తెరకెక్కిన ‘అన్నాత్తే’ సినిమాకి అనువాదంగా వస్తోంది ‘పెద్దన్న’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుందని.. ఈ చిత్రంలో మంచి కథ, మంచి పాటలు.. భావోద్వేగాలు, అన్నాచెల్లెళ్ల బంధం, క్లాస్ మాస్ కలిసి చూడగలిగే అంశాలున్న సినిమా. అందుకే మేం కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. నయనతార, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.