పూరీ జగన్నాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో యిజాన్నిచూపించడంలో ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పాడు. అతడి సినిమాలో హీరో పలికే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పూరీని డ్యాషింగ్ డైరెక్టర్ అంటారు. ప్రస్తుతం పూరీ లైగర్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే తాజాగా హనుమకొండలో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ వేడుకలో మైక్ టైసన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
‘లైగర్’ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్నపేరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈక్రమంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హన్మకొండలో నిర్వహించింది. దీనికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు.
ఈ వేడుకలో పూరీ మాట్లాడుతూ.. మీకో నిజం చెప్పాలి.. అర్జున్ రెడ్డి సినిమా చూడలేదని నా భార్య నన్ను తిట్టింది. దాంతో వెంటనే నేను ఆ మూవీని చూడడం స్టార్ట్ చేశా! కానీ 45 నిమిషాలు చూసి ఆపేశాను. సినిమా చూడలనిపించలేదు. ఇంత నిజాయితీతో ఏ హీరో అయినా నటిస్తాడా? అంటూ విజయ్ మీదికి దృష్టి మళ్లింది. అతనితో ఎలాగైనా మూవీ తీయాలి అనుకున్నా. ఇప్పుడు అది నెరవేరింది. నిర్మాత కష్టాల్లో ఉంటే విజయ్ తనకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాడు అంత మంచి వ్యక్తి అతడు అంటూ విజయ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఇక ఈ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఛార్మీదే అని ఆయన తెలిపారు. అయితే టైసన్ తో మెుదటి రోజు షూటింగ్.. అంతా రడీగా ఉన్నాం అసలు వీడు వస్తాడా! రాడా అని టెన్షన్ లో ఉండగా వచ్చాడు టైసన్. మైఖేల్ జాక్సన్, బ్రూస్లీ ల లాగే మైక్ కూడా పల్లెటూర్లలో సైతం తెలుసు. అయితే నేను, విజయ్ మైక్ టైసన్ పక్కన కూర్చుంటే ఒక జంతువు పక్కన కూర్చున్నట్లే ఉండేది. ఒక గుర్రం, ఏనుగులా మైక్ కనిపిస్తాడని పూరీ అన్నాడు. అతని పుర్రె, బాడీ అంత లావు ఉంటుందని ఈ సందర్భంగా పూరీ తెలిపాడు. ప్రస్తుతం పూరీ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పూరీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.