తెలుగు సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ లపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫైనాన్సియర్ వి.ఎస్.శ్రవణ్ కుమార్ ఛీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2018-19 మధ్యకాలంలో తన దగ్గర రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఇవ్వాల్సిన అప్పును కట్టాల్సిందిగా అడిగితే స్పందించకపోగా బెదిరిస్తున్నారని ఫైనాన్సియర్ శ్రవణ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయం పై బెల్లంకొండ సురేష్ స్పందించినట్లు తెలుస్తుంది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగమే నాపై నమోదైన కేసు. శ్రవణ్ నాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నాపై, నా కొడుకుపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శ్రవణ్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శ్రవణ్ తో కలిసి కొంతమంది వ్యక్తులు చేస్తున్న కుట్ర ఇది. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టకపోతే పరువునష్టం దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు.
నేను పోలీసుల విచారణకు సహరిస్తాను. నన్ను బ్యాడ్ చేయడానికే నాకు 85 లక్షల రూపాయలు ఇచ్చానని శ్రవణ్ ఆరోపించి, కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశాడు. నా పిల్లల జోలికి వచ్చాడు. నాకు నా పిల్లలే పంచప్రాణాలు. శ్రవణ్ ని లీగల్ గా ఎదుర్కొంటాను. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ ది మా ఊరే.. పదేళ్ళ క్రితం పరిచయమయ్యాడు. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు. అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతను క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను. బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. శ్రవణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతనెవరో త్వరలో బయటపెడతా” అన్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.