తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి మార్కులే అందుకుంది ప్రముఖ నటి ప్రియమణి. మూడు పదుల వయసుదాటినా..చెక్కుచెదరని అందంతో వరుస అవకాశాలను అందుకుంటోంది. పరుత్తివీరన్ అనే తమిళ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది ప్రియమణి. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇటు నటనతోను అటు అందంతోను పేక్షకులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లోని బడా స్టార్స్ తో నటించి నటనలో నాకెవ్వరు సాటిలేరంటూ నిరూపించింది ఈ భామ.
ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రియమణి దక్షిణాది వెండితెరపై మంచి నటిగా గుర్తింపు పొందింది.ఇక గత కొన్ని రోజుల నుంచి వెండి తెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ హీరోయిన్. అలాగని ప్రేక్షకులకు దూరమవ్వకుండ బుల్లితెరపై అడుగుపెట్టింది. ఇక అక్కడ కూడా తన మార్క్ ను చెక్కుచెదరనివ్వటం లేదు. బుల్లితెరపై రియాలిటీ షోస్, ఢీ వంటి షోలతో దూసుకెళ్తోంది. దీంతో ప్రియమణి మళ్ళీ వెండితెరపై అడుగుపెట్టి వరుస అవకాశాలను అందుకుంటోంది. వేను ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నక్సలైట్ గా భారతక్క అనే పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ఓటిటి ద్వారా విడుదలకు సిద్ధమవుతోందని తేలుతోంది.
దీంతో పాటుగా విక్టరి వెంకటేష్ హీరోగా రూపొందుతున్న నారప్ప అనే చిత్రంలో కూడా మెరవనుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక విషయానికొస్తే చాల ఏళ్ల నుంచి ప్రియమణికి ఓ కోరిక ఇంకా అలాగే ఉందట. టాలీవుడ్ బడా స్టార్ హీరోలైన వింకటేష్, చిరంజీవి, నాగార్జునతో కలిసి నటించాలనుకుందట. ఇక ఎలాగో నాగ్, వెంకటేష్ తో నటించింది. ఇక మిగిలింది మాత్రం చిరంజీవితోనే. తాజాగా తన మనసులోకి మాట బయటపెడుతూ..చిరంజీవితో నటించాలనుకునే కోరిక ఇంకా మిగిలే ఉందంటూ తెలిపింది ప్రియమణి. మరి ఇంతకు ప్రియమణి అనుకుంటున్నట్లు ఆ కోరిక తీరుతుందో లేదో చుడండి మరి.