గత రెండు మూడు నెలల నుంచి మా ఎన్నికల వేడి రాజుకుంటూ మాటా మాటా పెరిగి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్తోంది. మొదట మా అధ్యక్ష పోరులో పోటీ చేస్తున్నాని ప్రకాశ్రాజ్ ప్రకటించాడో లేదో అటు నుంచి మంచు విష్ణు, జీవితా, హేమా, సీవీఎల్ నరసింహరావు వంటి ప్రముఖ నటీనటులు పోటీలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుగాప్రకాశ్రాజ్ ఏకంగా గ్రూప్ సభ్యుల వివరాలను మీడియా ముందు ప్రకటించారు.
దీంతో మా ఎన్నికలకు కాస్త హీట్ పెరిగినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి. మా ఎన్నికల్లో అధ్యక్ష పోటీదారులుగా ఉన్న జీవితా, హేమ ప్రకాష్ రాజ్ చెంతకు చేరిపోయారు. ఇదే విషయాన్ని స్వయంగాప్రకాశ్రాజ్ శుక్రవారం మీడియాతో పంచుకున్నారు. ఇక ఆయన మాట్లాడుతూ..మా బిడ్డలం..రెండు నెలల మౌనం దానికొక అర్థముందని, కానీ ఈ మధ్య కాలంలో చాలా జరిగిందంటూ ఆయన తెలిపారు.
రెండు నెలల ముందు మేము గ్రూప్ లా మాత్రమే మీ ముందుకు వచ్చామని, అందరూ దానిని ప్యానెల్ అనుకున్నారని స్పష్టం చేశారు. కానీ ఈ రోజు ప్రకటించబోయేదే ప్యానెల్ అని తెలిపారు. ఇక గత రెండు నెలల నుంచి మా ఎన్నికల ప్రకటనను ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురుచూశామని, ఇక ఆ తేదీ కూడా రానే వచ్చిందని తెలిపారు. ఇక హేమా, జీవితా మా ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారని, కానీ నేను వాళ్లతో మాట్లాడనని అన్నారు. నా ఆలోచనలు నచ్చి హేమా, జీవితా ఇద్దరూ కూడా నాకు మద్దతు ఇవ్వటానికి ముందుకు వచ్చారని స్పష్టం చేశారు ప్రకాశ్రాజ్.
అధ్యక్షుడు- ప్రకాశ్రాజ్, ట్రెజరర్-నాగినీడు, జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్
ఉపాధ్యక్షుడు: బెనర్జీ, ఉపాధ్యక్షుడు- హేమ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్-శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ-జీవితా రాజశేఖర్
ప్రకాశ్రాజ్ ప్యానల్లో ఎగ్జిక్యూటివ్ సభ్యులు:
అనసూయ,అజయ్,బి.భూపాల్ ,బ్రహ్మాజీ, బుల్లితెర నటుడు ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూం
కౌశిక్, ప్రగతి,రమణరెడ్డి,శివారెడ్డి,సమీర్,సుడిగాలి సుధీర్,డి.సుబ్బరాజు,సురేశ్ కొండేటి,తనీశ్, టార్జాన్