సినీ ఇండస్ట్రీలో రేంజు, రేటు అనే పదాలది విడదీయరాని బంధం. రేంజు పెరిగే కొద్దీ రేటు పెంచుకుంటూ పోతుంటారు స్టార్స్. ప్రెజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ కొంతమంది తారల పారితోషికాలు ఆకాశాన్నంటాయి. ఒక్కో సినిమాకి వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. ‘బాహుబలి’ సిరీస్ తో యావత్ దేశంలో విపరీతమైన స్టార్ డమ్ సంపాదించాడు ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ సినిమాకోసం తెలుగు ఆడియెన్స్ ఏ రేంజులో ఎదురుచూస్తుంటారో? పరభాషా ప్రేక్షకులు కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక.. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ రేంజు భారీగా పెరగడంతో.. రెమ్యునరేషన్ కి కూడా రెక్కలొచ్చాయి. అయితే.. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’.. ఇప్పుడు రాబోతున్న ‘రాధేశ్యామ్’ రెండింటికీ ప్రభాస్ హోమ్ బ్యానర్ వంటి యు.వి.క్రియేషన్సే నిర్మాత. కాబట్టి.. ఈ సినిమాలకు ప్రభాస్ తీసుకున్న పారితోషికాల విషయంలో పెద్ద చర్చ జరగలేదు. కానీ.. ఆ తర్వాత రాబోతున్న ‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలకు సంబంధించి ప్రభాస్ రెమ్యునరేషన్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలకు గానూ.. ఒక్కొక్క చిత్రానికి వంద కోట్లు పైనే పారితోషికం పుచ్చుకుంటున్నాడట ప్రభాస్. నాగ్ అశ్విన్ సినిమాకి రెమ్యునరేషన్ ఇంకాస్త ఎక్కువే అని తెలుస్తోంది. తెలుగు తారలలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక రెమ్యునరేషన్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ తో పోటీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న మరో హీరో అక్షయ్ కుమార్ . బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ వరుసగా ఆరు సినిమాలను విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. వీటిలో ఇప్పటికే ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’, ‘అత్రంగి రే’, ‘బచ్చన్ పాండే’ వంటి సినిమాలు పూర్తయ్యాయి. ‘పృథ్వీరాజ్’ కొంతభాగం షూటింగ్ మిగిలి ఉండగా.. ‘రామ్ సేతు’ త్వరలో షురూ కాబోతుంది. బాలీవుడ్ ఖాన్ త్రయం.. ఏడాదికి, రెండేళ్లకు ఒక సినిమా చొప్పున విడుదల చేస్తుంటే.. సీజన్, అన్ సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటాడు అక్షయ్ కుమార్. ఇక.. ప్రస్తుతం ఈ ఆరు సినిమాలకు గానూ.. ఒక్కో చిత్రానికి ఏవరేజ్ గా అక్కీ 117 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు బాలీవుడ్ టాక్.
తమిళ చిత్ర సీమలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్. ఫ్యాన్స్ ముద్దుగా ఇలయదళపతి అని పిలుచుకునే విజయ్.. ఓ తెలుగు-తమిళం బైలింగ్వల్ కోసం ఏకంగా 100 కోట్లు పారితోషికాన్ని అందుకోబోతున్నాడట. ఇక.. ఆ చిత్రాన్ని నిర్మించేది మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. వంశీ పైడిపల్లి చిత్రంకోసం విజయ్ కి వంద కోట్లు పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడట దిల్ రాజు. ఇప్పటికే ‘మాస్టర్’ హీరోకి 10 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.