భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నచిత్రం "ఆదిపురుష్". ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ విడుదల కాబోతున్నా.. ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.
ప్రభాస్.. ఈ ఒక్క పేరు టాలీవుడ్ స్టామినాకి చిరునామాగా మారి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు డార్లింగ్ మూవీ అంటే ఆయన ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. ఆల్ ఇండియా మూవీ లవర్స్ అందరికీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. ఈ క్రేజ్.. హీరోగా ప్రభాస్ కు, ఆయన ఫ్యాన్స్ కు బాగానే ఉన్నా మేకర్స్ కు మాత్రం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఈ పాన్ ఇండియా స్టార్ నటించే సినిమాల అప్డేట్స్ కోసం మొత్తం ఇండియా వెయిట్ చేయడం, ఆ అప్డేట్ ఆశించిన స్థాయిలో లేకుంటే ఆ మేకర్స్ కు చుక్కలు చూపించడం పరిపాటి అయిపోయింది. ఈ విషయంలో “ఆదిపురుష్” టీమ్ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో.. ఈ ట్రోల్స్ కు చెక్ పెట్టి.., “ఆదిపురుష్” డ్యామేజ్ కి బ్రేక్ వేయడానికి ఏకంగా మన బాహుబలే రంగంలోకి దిగాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
రెబల్ స్టార్ ఖాతాలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి. ‘ఆదిపురుష్’ కాకుండా.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’, పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’, మారుతితో ‘రాజా డీలక్స్’ క్యూలో ఉన్నాయి. ఇక ఇవన్నీ కాకుండా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో “స్పిరిట్” కూడా పట్టాలు ఎక్కాల్సి ఉంది. వీటిలో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం “సలార్”. ప్రశాంత్ నీల్ ఇప్పటికే “కె.జి.యఫ్” తో వండర్ క్రియేట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయి ఉన్నాయి. “కె.జి.యఫ్” రేంజ్ ఎలివేషన్స్ గనుక.. ప్రభాస్ కటౌట్ కు పడితే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. దీంతో.. అందరి చూపు “సలార్” వైపు మళ్లింది. కానీ.., ఇప్పుడు ఇదే “ఆదిపురుష్” టీమ్ కి శాపంగా మారింది.
భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నచిత్రం “ఆదిపురుష్”. ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ విడుదల కాబోతున్నా.. ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. టీజర్ తేలిపోవడం, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత స్కోప్ లేకపోవడం, పైగా.. సీజి తేడా కొట్టేసిందన్న టాక్ బయటకి రావడంతో ‘ఆదిపురుష్’పై ఫ్యాన్స్ కు ప్రేమ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో గనుక “సలార్” అప్డేట్స్ బయటకి వస్తే.. “ఆదిపురుష్” పై ఫ్యాన్స్ కు ఫోకస్ లేకుండా పోతుంది. ఇందుకే.. ‘ఆదిపురుష్’ విడుదల అయ్యే వరకు “సలార్” అప్డేట్స్ హోల్డ్ లో పెట్టాల్సిందిగా ప్రభాస్ నుండి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ఓం రౌత్ ఇప్పటికే చేయాల్సిన అన్నీ మార్పులు చేసి.. ‘ఆదిపురుష్’కి న్యూ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకవేళ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి.. ‘ఆదిపురుష్’గనుక బాక్సాఫీస్ వద్ద నిలబడితే.. మైథలాజికల్ మూవీ కాబట్టి భారీ కలెక్షన్స్ రావడం ఖాయం. అందుకే ‘ఆదిపురుష్’ కోసం “సలార్” ని సైతం సైడ్ చేస్తున్నాడట డార్లింగ్. సో.. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయినా.. కొన్నిరోజుల వరకు “ఆదిపురుష్” పై ఆసక్తి పెంచుకోక తప్పదు. మరి.. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్ గా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.