దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేది చాలా పాత మాట. కానీ.., సినీ ఇండస్ట్రీలో స్టార్లందరకీ ఈ మాటే తారక మంత్రం. కానీ.., రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం గుమ్మందాకా వచ్చిన కోట్ల రూపాయలను చాలా క్యాజువల్ గా వద్దు అనుకున్నాడట. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క సినిమాలు చాలు.. ఇండస్ట్రీలో ఒక హీరోని లాంగ్రన్లో నిలబెట్టడానికైనా.. లేదా ఓవర్నైట్లో పడగొట్టాలన్నా కూడా. ఒకే ఒక్క సినిమాతో ఒక హీరో ఇమేజ్ మారిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ‘బాహుబలి’ అనే ఒక్క సినిమాతో ప్రభాస్కు వచ్చిన ఇమేజ్ మాత్రం అసాధారణమైంది. ఇలాంటి రైజ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వరకు లేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సీరిస్తో ప్రభాస్ మార్కెట్, అతని కోసం పెట్టే బడ్జెట్, అలాగే బిజినెస్ అన్నీ లెక్కలు మారిపోయాయి. అలాంటి ప్రభాస్ వందల కోట్ల ఈజీ మనీని తృణప్రాయంగా వదులకున్నాడన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ప్రభాస్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలే కాదు.. కార్పొరేట్ కంపెనీలు కూడా క్యూ కట్టేస్తున్నాయి. అతడి క్రేజ్ను తమ బ్రాండ్ల ప్రచారానికి వాడుకోవాలని ఎంతగానో చూస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లకు దీటుగా ప్రభాస్ కూడా యాడ్ల కోసం రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ.., ప్రభాస్ ఆ దిశగా అస్సలు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఒక్క మహీంద్రా ప్రకటనలో మినహా మరెందులోనూ ఈ రెబల్ స్టార్ కనిపించలేదు. అయితే అలా యాడ్స్ రూపంలో ప్రభాస్ వదులుకున్న సొమ్ము లెక్కంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టక తప్పదు.
కేవలం ఏడాది కాలంగా ప్రభాస్ బోలెడన్ని బ్రాండ్లను తిరస్కరించాడని.. వాటి విలువ రూ.150 కోట్ల వరకూ ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. బహుబలి తర్వాత అతను వద్దన్న మొత్తం యాడ్స్ విలువ దాదాపు.. రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఏవేవో బ్రాండ్లలో నటించి.. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఇష్టం లేకనే ప్రభాస్ ప్రకటనల్లో కనిపించేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఏదేమైనా ఒక్క ఏడాదిలోనే ప్రభాస్ రూ.150 కోట్ల ఆదాయం వదులుకోవడం అన్నది ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.