ఇటీవల ‘రాధే శ్యామ్‘ సినిమా విడుదలైన రోజున గుంటూరు జిల్లా కారంపూడి ఏరియాలో ప్రమాదవశాత్తు ప్రభాస్ అభిమాని ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆశగా అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూసిన ఆ అభిమాని.. కారంపూడిలో ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఫ్లెక్సీ కడుతూ చల్లా కోటేశ్వరరావు(37) అనే వ్యక్తి కరెంట్ షాక్ కి గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయాన్ని కారంపూడి ఏరియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హీరో ప్రభాస్ కి తెలియజేయడంతో ప్రభాస్ స్పందించాడు. తన అభిమాని కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు కారంపూడి మండల ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మృతుడి భార్య, తల్లిదండ్రులకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా అన్నివిధాలా కోటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాస్ సన్నిహితులు తెలిపినట్లు సమాచారం.ఇక ప్రభాస్ స్పందించి అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ వారు నిర్మించారు. మరి ప్రభాస్ దాతృత్వం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.