Prabhas: వెండి తెర రారాజు కృష్ణంరాజు ఇక లేరు అన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణంరాజు మరణాన్ని ఊహించుకోలేకపోతున్నారు. రెబల్ స్టార్ మరణంపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెదనాన్న మరణం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు తీరని లోటని చెప్పొచ్చు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పెదనాన్న, కొడుకులా కాకుండా.. సొంత తండ్రీకొడుకుల్లా ఉండేవారు. తమ ఇంటికి ఒకే ఒక్క అబ్బాయి అయిన ప్రభాస్పై కృష్ణంరాజు ఎంతో ప్రేమ చూపించేవారు.
ప్రభాస్ కూడా పెదనాన్న అంటే ప్రాణంగా ఉండేవారు. అన్ని విషయాల్లో పెదనాన్న సలహాలు, సూచనలు తీసుకునే వారు. అలాంటి తండ్రీకొడుకుల బంధానికి నేటితో తెరపడినట్లు అయింది. గతంలో కృష్ణంరాజు అనారోగ్యం పాలైనపుడు ప్రభాస్ ఎంతో విలవిల్లాడిపోయారు. దగ్గరుండి మరీ సేవలు చేశారు. నిన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ పెదనాన్నను పరామర్శించారు. ప్రభాస్ ఆసుపత్రిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రభాస్ బ్లాక్ డ్రెస్లో మాస్కు ధరించి ఉన్నారు. ప్రభాస్, కృష్ణంరాజును పరామర్శించిన కొన్ని గంటలకే ఆయన చనిపోవటం దురదృష్టకరం. ప్రస్తుతం ప్రభాస్ రెండు భారీ సినిమా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఒకటి కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న‘సలార్’ కాగా… మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’. మరి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై మీ సంతాపాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
ఇవి కూడా చదవండి : YS Jagan Mohan Reddy: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై సీఎం జగన్ సంతాపం