Paruchuri Gopala Krishna: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా హిట్టా ఫట్టా అనే విషయం పక్కనపెడితే.. మెగాస్టార్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆచార్య మూవీ కనీసం మెగా ఫ్యాన్స్ ని సైతం ఆకట్టుకోలేక పోయిందంటే.. ఏ స్థాయిలో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో ఆచార్య మూవీపై సీనియర్ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కీలక విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. “ఆచార్యలో తాము రాసిన ‘మరో మలుపు’ అనే సినిమాను పోలిన కథ, కథనం ఉన్నాయి. అయితే.. ఆ సినిమా హిట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఒక నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమా తీయాలని కొరటాల శివ అనుకోవడం.. ఆ లైన్ చిరంజీవి అంగీకరించడం జరిగింది.
ఇక సినిమాగా చూస్తే ఆచార్యలో ఎలాంటి తప్పులు లేవు. కానీ.. సినిమాలో అసలు ముఖ్యమైన విషయం ఏంటి? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు చెప్పకుండా కథను నడిపిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని నా అభిప్రాయం. ఎప్పుడైనా సరే సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడవు. సినిమాలో డైలాగ్స్, కథాంశం, నటీనటుల పర్ఫామెన్స్ బాగున్నా.. ఈ రోజుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు యూత్ కి నచ్చడం లేదు. స్టార్ హీరో అయినటువంటి రామ్ చరణ్ తో సిద్ధ పాత్ర చేయించకుండా ఉంటే బాగుండేది.
ఒకవేళ చరణ్ ని పెట్టాల్సి వచ్చినా.. ఫ్లాష్ బ్యాక్ లో కేవలం 10 శాతానికి చరణ్ పాత్రను పరిమితం చేసి, 90 శాతం చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండి ఉండేదేమో. ఇక ఆచార్యలో మణిశర్మ అందించిన సంగీతం పెద్దగా ఎక్కలేదు. దానికి తోడు కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఆచార్య పాత్రలో మెగాస్టార్.. ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయకుండా ఉండాల్సింది.
ఈ సినిమాకు ఆచార్య టైటిల్ కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ధర్మస్థలి, తండ్రీకొడుకుల పోరాటం, ఆఖరి పోరాటం లాంటి టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదేమో” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరుచూరి గోపాలకృష్ణ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆచార్య గురించి పరుచూరి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి: నరేష్ ముగ్గురు భార్యల బ్యాగ్రౌండ్.. మొత్తం ఎంతమంది పిల్లలంటే!