తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శర, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదే.. అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణ వార్త జీర్ణించుకోక ముందే.. సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 న హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, తెలుగు ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో సాహసాలకు మారు పేరుగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ 1964 లో తెనెమనసులు చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగు తెరకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. అప్పటి వరకు హాలీవుడ్ కే సొంతం అని చెప్పుకుంటున్న జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అల్లూరి సీతారామారాజు చిత్రంతో తొలి ఫుల్ స్కోప్, సింహాసనం మూవీతో తొలి 70 ఎంఎం లాంటి చిత్రాలు తీసి ఎన్నో అద్భుతమైన ప్రయోగాలకు నాంది పలికారు కృష్ణ. నటుడిగానే కాకుండా హైదరాబాద్ లో పద్మాలయ స్టూడియో నిర్మించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు.
నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో చురుకుగా పాల్గొనేవారు. నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాలు ప్రజా సేవ చేశారు. తాజాగా నటుడు, మాజీ ఎంపీ సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినూత్న ప్రయోగాలు చేస్తూ సాహసాలకు పెట్టింది పేరుగా కృష్ణ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు అండగా నిలిచారు. కృష్ణ మృతికి సంతాప సూచికంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.