ఓం రౌనత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ప్రధాన పాత్రల డిజైన్ విషయంలో దర్శకుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌనత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇక ఆదిపురుష్ మూవీపై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీలో రామాయణాన్ని తప్పుగా చూపించారని.. కొన్ని పాత్రలను అసలు సంబంధం లేకుండా చూపించారని హిందూసంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో గతంలో రావణసురుడిగా గురించి జూ.ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
హిందూ పురాణాల్లోని రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. ఇక రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై ఏ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదిపురుష్ మూవీలో దర్శకుడు ఓం రౌనత్ ప్రధాన పాత్రలు చూపించిన తీరుపై చాలా మంది తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరుపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. రావణాసురుడికి స్పైక్స్ పెట్టడం, పాములతో మసాజ్ చేయించుకోవడం, మాస్క్లు పెట్టడం వంటివి చూపించారు ఓం రౌత్. గతంలో వచ్చిన సినిమాలు, సీరియల్స్ లో రావణాసురుడిని ఎలా చూపించారో ఒక్కసారి కూడా చూడలేదా ఓం రౌనత్ అంటూ ప్రేక్షకులు ఆయనపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే జూ.ఎన్టీఆర్ గతంలో రావాణాసురిడి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశ మూవీ రావణాసుడి భక్తుడిగా కనిపిస్తాడు ఎన్టీఆర్. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. రావణ బ్రహ్మ గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు. రావణాసురుడు 18 లోకాలకు రాజు.. అసురుల చక్రవర్తి. అన్ని లోకాలకు అధిపతి అయ్యారంటే ఆయనకు ఎంత నేర్పు ఉండాలు. ఆయన ముల్లోకాల దేవతలనే భయపెట్టాడు. ఆయన కళ్లు ఎంత తీక్షణంగా ఉంటాయంటే.. ఎవ్వరైనా ఆయనకు ఎదురుగా వస్తే మొత్తం స్కాన్ చేసి వారి గురించి చెప్పగలరు. ఆయన వేదాలను అవపోషన పట్టాడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు, తన భక్తితో పరమ శివుడినే గడ గడలాడించాడు. అంటూ రావణాసురుడి గొప్పతననని ఎంతో చక్కగా వివరించారు. జై లవకుశ మూవీకి ముందు ‘అసుర’ అనే పుస్తకాన్ని చదివి రవణాసురుడి పాత్ర ఔన్నత్యం గురించి పూర్తిగా తెలుసుకున్నానని అన్నాడు.
ఈ వీడియోలో రావణుడి గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అసలు ఎన్టీఆర్ కి రావణాసురుడి గురించి తెలిసినంత కూడా ఓం రౌనత్ కి తెలియకపోవడం దౌర్బాగ్యం.. అందుకే ఆదిపురుష్ మూవీలో రావణాసురుడిని అలా డిజైన్ చేశారని నెటిజన్లు ఓ రేంజ్ లో తిడుతున్నారు. రామాయణం గురించి తెలియకుండా మిడి మిడి జ్ఞానంతో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తే ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆదిపురుష్ మూవీపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.420 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం కలెక్షన్లు పడిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
@tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan’s Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3
— Narasimha (@NTRNarasimha_) June 19, 2023