స్వర్గీయ నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పు.తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఇక రాజకీయ జీవితం పెను సంచనలమే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదూ.. కొన్ని నెలల్లోనే పార్టీ ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈ నెల 28తో ఆయన శత జయంతి
నటుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందిన ఏకైన నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పు ఆయన. నటుడిగా, వ్యక్తిగా ఆయన ప్రస్థానాన్ని కొనియాడని వ్యక్తులు లేరు. ఆయన సమయపాలన, నిబద్దత, నిరాడంబరత, ఆహారం, ఆహార్యం అనితర సాధ్యం. మొదటి సినిమా మన దేశం నుండి చివరి సినిమా శ్రీనాథ కవి సార్వభౌమ వరకు విభిన్న చిత్రాల్లో నటించి.. తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఇక రాజకీయ జీవితం పెను సంచనలమే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదూ.. కొన్ని నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ప్రజా సంక్షేమ పథకాలను తీసుకు వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు భాషను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేయడమే కాకుండా.. ఇప్పుడు దేశంలో అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనే. ఈ నెల 28తో ఆయన శత జయంతిని జరిపారు కుటుంంబ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.
ఎన్టీఆర్ మంచి వ్యక్తే కాదూ.. గౌరవ మర్యాదలు తెలిసిన మహానుభావుడు. ఈ విషయాన్నిపరిశ్రమలోని ప్రతి ఒక్కరు చెబుతారు.తప్పు చేయకపోతే ఎవ్వరికీ తలవంచని నైజం ఆయనదీ. కానీ ఓ హీరోయిన్ విషయంలో ఆయనకు తెలియకుండా జరిగిన తప్పుకు సారీ చెప్పారు. ఆ విషయాన్ని ఆ హీరోయినే చెప్పింది. ఆమె ఎవరో కాదూ లేడీ అమితాబచ్చన్ విజయ శాంతి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగాఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె. పలు ట్వీట్లు చేశారు. ‘ సుమారు 1980ల్లో నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ సమయంలోనే మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు.. 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్లో కలవడానికి వెళ్లాను. డబ్బింగ్ థియేటర్లో వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్కి హైదరాబాదులో షూటింగ్కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ (విజయ శాంతి భర్త) గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ .” అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే..’ అని ట్వీట్ చేశారు.
‘ ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు .ఆదరాభిమానాలకు మరో రూపు… ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు. 100 సంవత్సరాలైనా.. మరో వంద సంవత్సరాలైనా.. సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే… సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే.’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుత బీజేపీ నేత విజయ శాంతి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు
డాక్టర్ ఎన్టీఆర్ గారు…
నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో… pic.twitter.com/5jZari2c62
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 27, 2023