Nithya Menon: గత కొన్ని నెలలుగా తన పెళ్లి విషయంలో వస్తున్న పుకార్లకు కారణం ఏంటనే దానిపై హీరోయిన్ నిత్యామీనన్ స్పందించారు. పుకార్ల వెనుక ఓ యూట్యూబర్ ఉన్నాడని, అతడే తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. సదరు యూట్యూబర్ వేధింపుల గురించి మాట్లాడుతూ.. ‘‘ ఈ పుకార్లకు ప్రధాన కారణం సంతోష్ వర్కీ అనే ఓ యూట్యూబర్. అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని కూడా వదలటం లేదు. వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు.
ఇప్పటివరకు అతడికి సంబంధించిన 30 నెంబర్లను బ్లాక్ చేశాను. నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. మా వాళ్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం అన్నారు. కానీ, నేను క్షమించి వదిలేశా. అయినా అతడు మారలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుందని అన్నాడు. అప్పటినుంచి నా పెళ్లిపై పుకార్లు మొదలుపెట్టాడు’’ అని పేర్కొన్నారు. కాగా, నిత్యా మీనన్ దశాబ్ధానికిపైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా ఆమెపై పెద్దగా పుకార్లు రాలేదు. కానీ, గత కొద్దినెలల నుంచి వరుసగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కోలీవుడ్, మాలీవుడ్ సినిమా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే వివాహం అంటూ ఓ సారి.. ఓ బిజినెస్ మ్యాన్తో పెళ్లంటూ ఇంకో సారి.. నెలకో పుకారు షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిత్యా మీనన్ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ పుకార్లకు కారణం ఏంటంన్న సంగతిని కూడా తేల్చి చెప్పారు. మరి, నిత్యా మీనన్ను వేధిస్తున్న సంతోష్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kalyan Ram: హీరో నందమూరి కల్యాణ్ రామ్ భార్య స్వాతి బ్యాక్గ్రౌండ్!