నయనతార- విఘ్నేశ్ గత కొద్ది నెలలుగా ఈ పేర్లు అటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే పెళ్లిబంధంతో ఒకటైన ఈ ప్రేమజంట ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. నయనతార పెళ్లి దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయ్యింది. నేట్ఫ్లిక్స్ అయితే దానిని డాక్యుమెంటరీగా విడుదల చేయబోతోంది. పెళ్లి తర్వాత రెండుసార్లు హనీమూన్కు వెళ్లిన ఈ జంట.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే వీళ్లు మాకు కవలలు పుట్టారు అంటూ పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు తావిచ్చింది. పెళ్లై కొన్ని నెలలు మాత్రమే అయ్యింది.. అప్పుడే కవలలు ఎలా పుట్టారని అంతా ముక్కున వేలేసుకున్నారు.
అయితే అక్కడే అందరికీ బోదపడింది ఏంటంటే.. వాళ్లు సరోగసీ(అద్దె గర్భం) ద్వారా పిల్లలను కన్నారు. అయితే అదే పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే భారత్లో కమర్షియల్ సరోగసీని నిషేదించారు. మరి.. వీళ్లు అలా ఎలా పిల్లలను కన్నారు అని విమర్శలు వచ్చాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం వారికి నోటీసులు కూడా జారీ చేసింది. వారి సరోగసీకి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే అక్కడే నయన్- విఘ్నేశ్ ఇద్దరూ అందరికీ పెద్ద షాకిచ్చారు. వారికి ఆరేళ్ల క్రితమే వివాహం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చారు. వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లో అందుకు సంబంధించిన రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా జత చేశారు. అంతేకాకుండా యూఏఈలో నయన్కు దగ్గరి బంధువు సాయంతో పిల్లల్ని కన్నట్లు వెల్లడించారు.
గతంలో పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ పెట్టారు. మళ్లీ ఎప్పుడూ వారిని చూపించలేదు. ఇప్పుడు తాజాగా ఇద్దరు పిల్లలతో నయన్- విఘ్నేశ్ ఒక వీడియో చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ చెరో బిడ్డని ఎత్తుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. మొదటి విఘ్నేశ్ విష్ యూ ఏ హ్యాపీ దివాళీ అంటూ చెప్పగా ఆ మాటలను నయనతార రిపీట్ చేసింది. తర్వాత విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నట్లు హ్యాపీ దివాళీ ఎవ్రీ టూ అంటూ విషెస్ చెప్పాడు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరి వీడియోకి హీరోయిన్ కాజర్ అగర్వాల్ రిప్లై ఇచ్చింది. ఎంత క్యూట్గా ఉందో.. మీ ఇద్దరు పిల్లలకు మొదటి దీపావళి శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేసింది.