తెలుగు సినిమా రంగంలో వివాదాస్పద జంటగా మారిన నరేష్, పవిత్రలు అందరికీ షాక్ నిచ్చారు. వారిద్దరూ ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నరేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, నరేష్ మూడో భార్య రమ్యతో వివాదం సద్దుమణగకుండానే వీరు పెళ్లి పీటలు ఎక్కారు.
తెలుగు సినీ పరిశ్రమలో మరో జంట పెళ్లిపీటలు ఎక్కింది. వివాదాస్పద జంటగా పేరొందిన నరేష్, పవిత్రలు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత గోప్యంగా ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్న ఈ జంట బంధువులు, సన్నిహితుల మధ్యలో ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. తమ పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్ అందర్ని షాక్ లో ముంచెత్తారు. నరేష్కు ఇది మూడో వివాహం కాగా, పవిత్రకు ఇది రెండో పెళ్లి. కొత్త ఏడాది సందర్భంగా కొత్త ప్రారంభాలు అని .. వారి మధ్య రిలేషన్ను వీడియో రూపంలో అనౌన్స్ చేసిందీ ఈ జంట. ఇప్పుడు తాజాగా మరో వీడియోతో సంచలనం సృష్టించిందీ.
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోలో కొద్ది మంది అతిధులు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే నరేష్, అతని మూడో భార్య రమ్య మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ సమయంలో ఈ పెళ్లి వివాదాస్పదంగా మారింది. వీరి వివాదం కోర్టులో ఉండగానే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై రమ్య ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ నరేష్, పవిత్రలు…4 ఏళ్ళుగా కలిసి ఉంటున్నారు. రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకుంటామని గతంలో చెప్పిన ఈ జంట.. ఏడడుగుతలతో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. అయితే ఇది ఏదన్నా సినిమా షూటింగ్లో భాగమా అని కూడా తెలియాల్సి ఉంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023