టాలీవుడ్ క్రేజియెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన నరేష్, పవిత్రల జంట పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిందీ. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ లో చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా రంగంలో వివాదాస్పద జంటగా మారిన నరేష్, పవిత్రలు అందరికీ షాక్ నిచ్చారు. వారిద్దరూ ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నరేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, నరేష్ మూడో భార్య రమ్యతో వివాదం సద్దుమణగకుండానే వీరు పెళ్లి పీటలు ఎక్కారు.
సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో త్వరలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్ చనిపోతారని జోతిష్యం చెప్పాడు.