టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కుటుంబ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో నరేశ్, అతని మూడో భార్య రమ్య రఘుపతి కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో నరేశ్ సహజీవనం, పెళ్లి ఆరోపణలతో రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల విషయంలో నరేశ్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నాడు. తన మూడో భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉండగా.. ఆదివారం మైసూరులోని ఓ హోటల్ లో నరేశ్- పవిత్రా లోకేశ్ ఉండగా రమ్య అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆదివారం మైసూర్లోని ఓ హోటల్లో నరేశ్- పవిత్ర లోకేశ్ ఉండగా రమ్య రఘుపతి అక్కిడికి చేరుకున్నారు. హోటల్ నుంచి బయటకు వెళ్లబోతున్న నరేశ్- పవిత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్ ని కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆమెను పోలీసులు నిలువరించి బయటకు పంపేశారు.
ఆ ఘటన తర్వాత కారు ఎక్కుతూ నరేశ్ మీడియాతో ఈ ఘటనపై స్పందిస్తూ.. “రమ్య రఘుపతి మాపై ప్రత్యక్షంగా దాడికి దిగింది. రాకేశ్ శెట్టి అనే వ్యక్తితో కలిసి ఈరోజు మాపై దాడి చేసింది. రాకేశ్ శెట్టికి రమ్య రఘుపతికి అక్రమ సంబంధం ఉంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈరోజు ఇలా ఇద్దరూ కలిసి మాపై దాడికి దిగారు” అంటూ నరేశ్ ఘాటు విమర్శలు చేశారు. రమ్య రఘుపతి తన ప్రియుడితో కలిసి తమపై దాడి చేసిందంటూ స్పందించాడు.
ఈ విషయంలో రమ్య రఘుపతి స్పందింస్తూ.. “నా భర్త నాకు కావాలి.. నాకు న్యాయం చేయండి. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నేను విడాకులను సమర్థించను, నమ్మను. నా కొడుకు కూడా విడాకులు ఇవ్వదంటూ అంటున్నాడు. వాడు చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. నేను విడాకులు ఇవ్వను.. నా భర్త నాకు కావాలి” అంటూ రమ్య రఘుపతి వ్యాఖ్యానించింది. రమ్య రఘుపతి విషయంలో నరేశ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.