సినిమా-రాజకీయాలకు విడదీయరాని అనుబంధం. ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటీనటులు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం, అక్కడ కూడా పేరు తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్లు కూడా ఓవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు ఎమ్మెల్యేగానూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు పక్కనబెడితే.. తెలుగుదేశం నేత నారా లోకేష్. కేజీఎఫ్ హీరో యష్ ని కలవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కేజీఎఫ్’ రెండు పార్ట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన హీరో యష్. ప్రస్తుతం తన తర్వాత సినిమాల కోసం కథలు వింటున్నారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాబోయే ఎలక్షన్స్ కోసం జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరికీ అసలు సంబంధమే లేదు. అలాంటిది సడన్ గా వీళ్లిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీళ్లు కలిసిన కారణం ఏంటి? ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
. @JaiTDP General secretary @naralokesh meets the PAN INDIA sensation @TheNameIsYash.#NaraLokesh #Yash pic.twitter.com/FX7vFmW02B
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 15, 2022