తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో ఆరోగ్యం విషమించి మంగళవారం కన్నుమూశారు.
ఇక సిరివెన్నెల సీతారామాశాస్త్రీ హఠ్మానరణంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రంలోకి వెళ్లింది. అయితే 1986 రచయితగా ప్రారంభమైన ఆయన ప్రస్థానంలో అనేక తెలుగు పాటలు రచించారు. అయితే మరీ ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలకు గాను ఎన్నో నంది అవార్డులు రావడం విశేషం. ఇక ఆయన సాధించిన నంది అవార్డుల వివరాలు చూస్తే గనుక..1986లో సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన విధాత తలపున అనే పాటకు మొట్టమొదటిసారిగా నంది అవార్డును దక్కించుకున్నాడు.
ఆ తర్వాత 1987 లో వచ్చిన శ్రుతిలయలు సినిమాలోని తెలవారదేమో స్వామి అనే పాటకు సైతం నంది అవార్డు వరించడం విశేషం. ఇక దీంతో పాటు 1993లో వచ్చిన గాయం సినిమాలోని సురాజ్యమవ్వాలని స్వరాజ్యమెందుకుని అనే పాటకు కూడా నంది అవార్డు లభించింది. ఇక 1994లో వచ్చిన శుభలగ్నం సినిమలోని చిలక లే తోడు లేక అనే పాటకు కూడా ఆయనకు నంది అవార్డు వరించింది. ఇదే కాకుండా 1996లో వచ్చిన శ్రీకారం మూవీ నుంచి మనసు కాస్త కలతపడితే అనే పాటకు సైతం నంది అవార్డు దక్కింది. ఈ పాటలే కాకుండా ప్రేమకథ-1999, చక్రం-2005, గమ్యం-2008, 2013లో వచ్చిన సీతామ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలకుగాను ఉత్తమ పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఏకంగా 11 అవార్డులు రావడం విశేషం.