మార్చి 18తో తారకరత్న చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా తరకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తారకరత్న భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
నందమూరి తారకరత్న అకాల మరణంతో.. అటు నందమూరి కుటుంబం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అయితే తన భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టని రోజు లేదనే చెప్పాలి. తన భర్తతో తనకు ఉన్న సన్నిహిత్యం గురించి సోషల్ మీడియాల వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ.. తన బాధను తెలియజేస్తూనే ఉంది. తాజాగా తారకరత్న మరణించి మార్చి 18కి సరిగ్గా నెల రోజులు కావొస్తుండటంతో.. భర్తతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. భర్తలేని లోటును తలచుకుంటూ.. సోషల్ మీడియాలో ఎమెషనల్ పోస్ట్ ను షేర్ చేసింది అలేఖ్య రెడ్డి.
నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దాంతో నందమూరి కుటుంబం, నందమూరి ఫ్యాన్స్ శోక సంద్రలో మునిగిపోయారు. మార్చి 18తో తారకరత్న చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా తరకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తారకరత్న భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ పోస్ట్ లో అలేఖ్య రెడ్డి ఈ విధంగా రాసుకొచ్చారు. “నువ్వు మా నుండి దూరం అయ్యి నేటితో సరిగ్గా నెల రోజులు అవుతుంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇప్పటికీ, ఎప్పటికీ దహించి వేస్తూనే ఉంటాయి. ఇక మన ప్రేమ ప్రయాణంలో నేను భయంగా ఉన్నాగానీ నువ్వు మాత్రం.. మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నాం అంటూ ఎంతో ధైర్యం ఇచ్చావ్. నీ పోరాటం ఫలితంగా మన పెళ్లి జరిగింది. అయితే మన పెళ్లి తర్వాత మనపై ఎంతో మంది వివక్ష చూపించారు. అయినా కానీ నువ్వు నా దగ్గర ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నిషిక పుట్టాక మన లైఫ్ మారిపోయింది. మన సంతోషం రెట్టింపు అయ్యింది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనల్ని అయినవాళ్లే ద్వేషించారు. నీ గుండెలోని బాధను వారు ఏనాడు అర్థం చేసుకోలేదు” అంటూ ఎమోషనల్ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మరిన్ని విషయాలు పంచుకుంటూ.. నువ్వు మరణించే వరకు ఎన్నో కష్టాలు పడ్డావు, నాకు పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి నీ కల 2019లో మనకు కవలలు జన్మించడంతో నిజమైంది అని అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చారు. అదీకాక మనకు కావాల్సిన వారే మనల్ని పదే పదే గాయం చేసినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్నాము అంటూ షాకింగ్ విషయాలు రాసుకొచ్చారు అలేఖ్య. ఇక తారకరత్న, అలేఖ్యలకు సపోర్ట్ గా ఉన్న వారిని కూడా కోల్పోయాం అని ఆమె ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు. చివరగా నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం, మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మాటలతో పాటు తారకరత్నతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి తారకరత్నను తలచుకుని అలేఖ్య రెడ్డి షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.