తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. నితిన్, నిఖిల్, రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు పెళ్లిబంధంతో ఒక ఇంటివారయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడు. 2011 లో ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు నాగౌశర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. నాగశౌర్య నటించి ఛలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నాగశౌర్య వైవిధ్యభరిత చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా హీరోగా తన మార్క్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల తన సహనటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో తాను కూడా ఓ ఇంటివాడు కావాలని నిర్ణయం తీసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన అమ్మాయి.. కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి మెడలో ఆదివారం మూడు ముళ్లు వేయనున్నారు. బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా బెంగుళూరులో ఓ స్టార్ హూటల్ లో వైభవంగా ఈ జంట పెళ్లి జపిరించేందుకు అన్ని ఎర్పాట్లు సిద్దమయ్యాయి.
శనివారం హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అనంతరం కాక్ టైల్ పార్టీని ఏర్పాటు చేశారు నాగశౌర్య కుటుంబ సభ్యులు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూష కు రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు. వధూవరులిద్దరూ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి నాగశౌర్య తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సినీ సెలబ్రెటీలు, అభిమానులు శభాకాంక్షలు తెలుపుతున్నారు.