తెలుగు హీరోయిన్ కి కారు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఆ సినిమా యూనిట్ చెప్తేనే గానీ బయటకు రాలేదు. మామూలుగా సినిమాల్లో రిస్కీ షాట్స్, స్టంట్లు చేయాల్సి ఉంటుంది. హీరోలైనా, హీరోయిన్లైనా రిస్క్ చేయక తప్పదు. ఈ క్రమంలో చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గాయాలు చిన్నవైతే మరికొన్ని సందర్భాల్లో ఆ గాయాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ ఆల్మోస్ట్ వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితికి వెళ్లిపోయిందట. సన్నగా నాజూకుగా ఉంది కాబట్టి సరిపోయింది గానీ అదే ఇంకొంచెం బరువు ఉండి ఉంటే జీవితాంతం వీల్ చైర్ లో కూర్చోవాల్సి వచ్చేదని ముఖచిత్రం సినిమా దర్శకుడు, రైటర్ వెల్లడించారు.
కలర్ ఫోటో వంటి అద్భుతమైన కావ్యాన్ని అందించిన దర్శకుడు సందీప్ రాజ్.. కలం నుంచి మరో అద్భుతమైన సినిమా రాబోతుంది. గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, అయేషా ఖాన్ నటించిన ముఖచిత్రం సినిమా డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే ప్రమోషన్ అన్నాక ప్రెస్ మీట్ లు.. ప్రెస్ మీట్ లన్నాక సినిమాలో నటించిన వారి కష్టాల గురించి టాకింగులు మామూలేగా. ఈ క్రమంలోనే ఈ సినిమాకి కథ అందించిన సందీప్ రాజ్, దర్శకుడు గంగాధర్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
ముఖచిత్రం సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించగా.. అందులో ఒక హీరోయిన్ గా నటించిన అయేషా ఖాన్ ముంబైకి చెందిన నటి. ఈ సినిమా కోసం ముంబై నుంచి వచ్చింది. అయితే సినిమా కోసం కార్ యాక్సిడెంట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ కి గాయాలు అయ్యాయట. అనుభవం లేకపోవడం వల్ల అయేషా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోయింది. దీంతో ఆమె నడుము, వెన్ను భాగంలో తీవ్ర గాయం అయ్యిందని అన్నారు. అయితే అయేషా తక్కువ బరువు ఉండడం వల్ల గాయం నుంచి త్వరగా కోలుకోగలిగిందని, లేదంటే జీవితాంతం వీల్ చైర్ లోనే కూర్చోవాల్సి వచ్చేదని దర్శకుడు గంగాధర్, సందీప్ రాజ్ వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె బాగా నటించిందని, ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.