సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా.. తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకి.. తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు హాజరై.. నవ దంపతులకు శుభాశీస్సులు అందించారు.
వీరిలో ప్రముఖ సినీ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామమోహన్ రావు, దర్శకులు మెహర్ రమేశ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సురేష్ కొండేటి తదితరులు ఉన్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ కుటుంబం.. కరోనాబాధితులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహారాన్ని అందించిన విషయం తెలిసిందే.