మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ‘వాల్తేరు వీరయ్య’ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్సే అందుకు ఉదాహరణ. తొలి మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత కూడా ఊపు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం 175 కోట్లకు పైనే వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూసిన ఫ్యాన్స్.. కామెడీ, డ్యాన్సుల్లో గ్రేస్, ఫైట్స్ లో ఒకప్పటి మెగాస్టార్ ని చూశామని తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమాలోనే హైలెట్ గా నిలిచిన ఓ సీన్ కు చిరు చాలా ప్లస్ అయ్యారట.
ఇక విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి కేవలం హీరోగా మాత్రమే కాకుండా సినిమా కోసం తన వంతు ఇన్ పుట్స్ ఇస్తూ ఉంటారు. గతంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ కంటే ముందు నుంచే ఇలా చేస్తున్నారు. అయితే ఎప్పుడూ కూడా తను సజెషన్స్ ఇచ్చినట్లు చిరు పెద్దగా చెప్పుకోలేదు. డైరెక్టర్ లేదా నిర్మాత లేదా రైటర్ చెప్పడం వల్ల బయటకొచ్చాయి తప్పితే చిరు అయితే పెద్దగా చెప్పుకోలేదు. ఇక ‘వాల్తేరు వీరయ్య’లోనూ చిరు అలాంటి సూచన ఒకటి చేశారు. ఆ విషయాన్ని డైరెక్టర్ బాబీ ఇప్పుడు రివీల్ చేశారు.
ఈ సినిమాలోని ఓ సీన్ లో భాగంగా చిరు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ ‘జారు మిఠాయి’ పాటని తన స్టైల్లో పాడతారు. ‘నేను లుంగీ ఎత్తా చూడు.. లుంగీ ఎత్తా చూడు’ అని తన మార్క్ కామెడీ పండించారు. ఇక ఈ సీన్ లో ఈ పాట పెట్టాలనే ఆలోచన చిరంజీవి అన్నయ్యదే అని డైరెక్టర్ బాబీ బయటపెట్టారు. ఈ సీన్ వచ్చినప్పుడైతే థియేటర్లలో ప్రేక్షకులు గోల గోల చేశారు. ఇదిలా ఉండగా చాలారోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట.. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అలాంటి సాంగ్ ని చిరు పాడటం ఇంకా హైలెట్ గా నిలిచింది. మరి చిరు పాడిన ‘జారు మిఠాయి’ పాట మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.